Cyberabad | సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్పై వేటు పడింది. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో మరో ఇద్దరు ఐపీఎస్లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. రామగుండం సీపీగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో తెలంగాణ మల్టీ జోనల్-2 ఐజీపీగా పనిచేస్తున్న తరుణ్ జోషిని రామగుండం సీపీగా నియమించారు.