సిటీబ్యూరో, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 394 వాహనాలను సైబరాబాద్ పోలీసులు బహిరంగ వేలం వేయనున్నారు. ఎవరైనా యజమానులు ఉంటే www.cyberabadpolice.gov.in లో తనిఖీ చేసుకోవాలని, తమ వాహనాలు ఉంటే కార్ హెడ్ క్వార్టర్స్ అధికారి జి.వెంకటస్వామి (949 1039164)ని సంప్రదించాలని సూచిస్తున్నారు.