కరోనా రెం డో దశ వ్యాప్తి పట్ల ప్రజలు ఎవరికి వారు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా వైరస్ ఇతరులకు సోకకుండా కట్టడి చేసేందుకు వీలవుతుందని వైద్య విభాగాలు పేర్కొంటున్నాయి. కరోనా బారిన పడుతున్న వారిలో 92 శాతం మంది ఇండ్లలోనే ఉంటూ తగిన మందుల వాడకం ద్వారా కోలుకుంటున్నారని, 8 శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని నిపుణులు అంచనా వేశారు. సకాలంలో వ్యాధిని గుర్తించడం, వ్యాధి తీవ్రత పెరగక ముందే ఆసుపత్రుల్లో చేరితే ఎటువంటి ప్రమాదం ఉండదని కొవిడ్ చికిత్సలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు చెబుతున్నారు.
సీరియస్ కండీషన్లో చేరిన వారిలో కూడా, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు కోలుకునేందుకు సమయం ఎక్కువ పడుతుందని, ఇతరులు వేగంగా కోలుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. ప్రస్తు త పరిస్థితుల్లో రెండో దశ వ్యాప్తి వేగాన్ని తట్టుకునేందు కు ప్రజలు మరింత అప్రమత్తం కావాలని, తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం ఉన్న వారు మాత్రం దవాఖానలో చేరాలని సూచిస్తున్నారు. సాధారణ వ్యాధి లక్షణాలున్న వారు మాత్రం ఇళ్లల్లోనే ఉం టూ సలహాలతో మందులు వాడి కరోనా నుంచి బయటపడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.