హయత్నగర్ : పాపతోపాటు దంపతులిద్దరూ అదృశ్యమైన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాగోల్, బండ్లగూడ, ఫతుల్లాగూడ, శివ శంకర్ కాలనీలో సొండూరు ప్రవీణ్ కుమార్(35), భార్య సూర్య మహాలక్ష్మి(31) దంపతులు కూతురు భావజ్ఞ సాయి ప్రశస్తి (01) తో కలిసి నివాసముంటున్నారు.
గత కొద్దిరోజులుగా ఇంటి నుండి వెళ్లిన ముగ్గురు కుటుంబ సభ్యులు తిరిగి రాలేదు. ఫోన్లు చేసినా స్విచ్ఛాఫ్ అని వస్తుంది. దీంతో ఆందోళనకు గురైన బంధువులు చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద అదృశ్యమైన కుటుంబ సభ్యుల వివరాల కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసిన వారు హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. అతని బావమరిది దుర్గ సురేందర్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.