ఉప్పల్, జనవరి 31 : చర్లపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ, న్యూవిరాట్నగర్ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం కార్పొరేటర్ శ్రీదేవి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్లను కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. న్యూవిరాట్నగర్లో నెలకొన్న డ్రైనేజీ, మంచినీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నామని తెలిపా రు. అదేవిధంగా కాలనీలో పారిశుధ్య నిర్వహణ పనులను వేగవంతం చేసేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు సుధీర్, వెంకటేశ్, జూపల్లి రాజు, బీఆర్ఎస్ నాయకులు బొడిగె ప్రభుగౌడ్, శ్రీనివాస్గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
పరిధిలోని రైల్ విహార్ కాలనీలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. కాలనీలో మినీ ఫంక్షన్ హాల్, బోర్ రిపేర్ పనులు, వెంకట్రెడ్డినగర్లో పెండింగ్లో ఉన్న పనులు చేపట్టాలని కోరుతూ కాలనీవాసులు ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వెంకట్రెడ్డినగర్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, రైల్ విహార్ కాలనీలో బోరు రిపేరు పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకువస్తామన్నా రు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు శర్మ, త్యాగరాజన్, ముత్తుమారన్, హరికృష్ణ, ఆంజనేయులు, మల్లికార్జున్, సిద్ధయ్య, మొగిలి పెంటేశ్, నర్సింహ, మురళి, శంకర్, సదానంద్, ప్రభుగౌడ్లు పాల్గొన్నారు.