ఒకప్పుడు పద్దతిగా ఉండే రాశీ ఖన్నా ఇప్పుడేమో హద్దులు మీరి అందాల ఆరబోతతో హాట్ టాపిక్గా నిలుస్తుంది. లాక్ డౌన్ సమయం నుండి ఈ అమ్మడు చేసే గ్లామర్ షోకు నెటిజన్స్ మంత్ర ముగ్ధులవుతున్నారు. తాజాగా ఓ అవార్డ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వెళ్లిన రాశీ ఖన్నా స్టైలిష్ డ్రెస్లో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో పాటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. తమిళంలో ‘సైతాన్ కా బచ్చా’ సినిమాలో నటిస్తుండగా, భ్రమం అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కించే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ సరసన రాశీ నటించనుంది. ఇక మారుతి-గోపీచంద్ సినిమాలోను రాశిఖన్నా నటించనుందని సమాచారం.