కరోనా నుంచి కాపాడే టీకాల పంపిణీలో హైదరాబాద్ జిల్లాలో సంపూర్ణంగా విజయవంతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్యాధికారుల ప్రత్యేక చర్యల వల్ల హైదరాబాద్ జిల్లాలో తొలిడోసు వందశాతం లక్ష్యాన్ని అధిగమించింది. జిల్లాలో 18 ఏండ్లు పైబడిన వారు 28,11,886 మంది ఉండగా, 104 శాతం మేర వ్యాక్సినేషన్ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో తొలిడోసు 79 శాతం, మేడ్చల్ జిల్లాలో 64 శాతం వరకు పూర్తయ్యిందని చెప్పారు. అధికారులు, సిబ్బంది కృషిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అభినందించారు.