జియాగూడ, జనవరి 30 : దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ జియాగూడ మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ నేతృత్వంలో టీఆర్ఎస్ నాయకులు ఆదివారం హోం మంత్రిని కలిసి దళిత బంధు అమలుపై వివతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ మాట్లాడుతూ.. జియాగూడ డివిజన్లో పెద్ద సంఖ్యలో దళిత కుటుంబాలు ఉన్నాయని, వారికి దళిత బంధు పథకం అమలయ్యేలా చూడాలని హోం మంత్రిని కోరినట్లు తెలిపారు. దళిత కుటుంబాలు అభివృద్ధి చెందెలా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరహరి చారి, సి.బాబు, జడల మోహన్ తదితరులు పాల్గొన్నారు.