కీసర, నవంబర్ 13 : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటున్నదని గోధుమకుంట సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన సోమని అరుణ అనారోగ్య నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ.75వేల చెక్కును మంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారురాలికి సర్పంచ్ మహేందర్రెడ్డి అందజేశారు. భోగారం గ్రామానికి చెందిన గురిజాల జంగాలుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.25వేల చెక్కును గ్రామ కో-ఆప్షన్ సభ్యుడు డబ్బి నర్సింహా రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భోగారం మాజీ సర్పంచ్ రాగి రాఘవేంద్రారెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు నర్సింహా రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కృష్ణ, శ్రీనివాస్రెడ్డి, గోధుమకుంట ఉపసర్పంచ్ ఆంజనేయులు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కృష్ణ, రమేశ్లతో పాటు పలువురు పాల్గొన్నారు.