CM Revanth Reddy | సిటీబ్యూరో, సెప్టెంబరు 13(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ విభాగపు అధికారులు ఇండోర్కు వెళ్లి అధ్యయనం చేయాలని అన్నారు. అకడ అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని సీఎం చెప్పారు. ఏయే ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు అకడ పనుల్లో పాలుపంచుకున్నాయో తెలుసుకొని చర్చలు జరపాలని, వీలైతే వారిని భాగస్వాములను చేయాలని చెప్పారు. క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఇండోర్ కార్పొరేషన్ ఆదాయ వనరులెలా సమీకరిస్తుందనే వివరాలు కూడా తెలుసుకోవాలని సీఎం పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
రోడ్లతో పాటు చెత్త సేకరణపై జీహెచ్ఎంసీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం అన్నారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలన్నారు. అవసరమైతే జీఐఎస్, క్యూ ఆర్ సాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం చెప్పారు.
జీహెచ్ఎంసీలో నిరంతరం జరిగే పనులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణకు కూడా స్పష్టమైన ప్రణాళికలు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇప్పుడున్న బకాయిల చెల్లింపులకు అవసరమైన నిధులను తాతాలికంగా సర్దుబాటు చేసుకోవాలని చెప్పారు. ఆదాయం పెంచుకునే మార్గాలతో పాటు, ఇప్పుడున్న లొసుగులను సవరించుకోవాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆస్తుల నుంచి వచ్చే అద్దెలు, అడ్వర్టయిజ్మెంట్లు, హోర్డింగుల ద్వారా వచ్చే ఆదాయం వస్తుందా? లేదా అని పర్యవేక్షించాలన్నారు.
హైదరాబాద్లో ఐదేండ్ల కిందట కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద 811 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారని, వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవటం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్తో కాంట్రాక్టు గడువు ముగిసిపోతుందని, అందుకే రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. గడువులోగా అన్ని రోడ్ల పనులను పర్యవేక్షించి, వెంటనే బాగు చేయించాలని చెప్పారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి 15 రోజుల్లోగా తనకు పూర్తి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతంలో సేకరించే స్థలాల్లో ఉన్న నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధ పడకుండా, వారికి భరోసా కల్పించాలని చెప్పారు. పునరావాస కాలనీలు ఎకడెకడ ఉన్నాయి, అకడ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా? లేదా అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ అధునీకరిస్తున్నందున, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అకడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని చెప్పారు. స్టేషన్ ముందు పారింగ్, కమర్షియల్ జంక్షన్ కు వీలుగా అప్రోచ్ రోడ్లు డిజైన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.