ఘట్కేసర్ రూరల్, మార్చి 9: ప్రతి అవకాశాన్ని యువ శాస్త్రవేత్తలు వినియోగించుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదపడాలని కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు. ఘట్కేసర్ మండల పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన ‘ఈ టెక్నో ఫెస్ట్ దక్ష-2023’ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నేటి సమాజంలో సృజనాత్మకత, ఆవిష్కరణల ప్రాముఖ్యం ఎంతో పెరిగిందన్నారు. డీఎంఆర్ఎల్ మాజీ డైరెక్టర్ జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు.
పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు సరైన వేదికను ఎంచుకోవాలన్నారు. 175 ఈవెంట్లతో కూడిన ఈ ఫెస్ట్కు వివిధ రాష్ర్టాల నుంచి 3,727 రిజిస్ట్రేషన్లు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ గ్లోబల్ డెలివరీ-క్లౌడ్ అండ్ ఇన్ప్రాస్ట్రక్చర్ సర్వీసెస్ జనరల్ మేనేజర్ కె.సురేందర్ రెడ్డి, యూనివర్సిటీ సీఈవో సూర్యదేవర నీలిమ, వైస్చాన్స్లర్ రామచంద్రం, రిజిస్ట్రార్ సమీన్ ఫాతిమా, కన్వీనర్ అనిల్ కుమార్, కో కన్వీనర్ రవికాంత్ రాజు, అన్ని విభాగాల డీన్లు, హెచ్వోడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.