హైదరాబాద్: హైదరాబాద్లోని పాతబస్తీలో సీబీఐ సోదాలు కలకలం సృష్టించాయి. పాతబస్తీలోని అజంపురా సహా ఆరు చోట్ల సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఒవైసీ దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్ అంజుమ్ సుల్తానా ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆమె భర్త నిర్వస్తున్న వ్యాపారాలపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. అంజుమ్ భర్త గతంలో ఆటో మొబైల్ షోరూమ్ నిర్వహించారు. ఆ సమయంలో తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.