హైదరాబాద్: పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడో క్యాషియర్. క్యాష్ కౌంటర్లో ఉన్న సొమ్ముతో ఉడాయించాడు మహానుభావుడు. ప్రవీణ్ అనే వ్యక్తి వనస్థలిపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలో క్యాషియర్గా (Cashier) పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం బ్యాంకులో ఉన్న రూ.22.53 లక్షలు తీసుకుని బయటకు వెళ్లాడు. ఎంతకు తిరిగిరాకపోవడంతో బ్యాంకు అధికారులు అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బ్యాంకు మేనేజర్ క్యాషియర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.