జవహర్నగర్, మార్చి 28: జవహర్నగర్ మేయర్ శాంతి, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్తో పాటు 5 మంది కార్పొరేటర్లు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడంతో జవహర్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్ తాజ్మోహన్రెడ్డి, ఆర్వో ప్రభాకర్ ఎన్నికల కోడ్ ఉల్లంగించిన మేయర్, డిప్యూటీ మేయర్ సహా 5 మంది కార్పొరేటర్లపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్హెచ్వో నాగరాజు మాట్లాడుతూ ఈ నెల 27న మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించడమే కాకుండా ఆసరా పింఛన్లు పంచారన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన మేయర్ శాంతి, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు శారద, లావణ్య, నాగరాణి, పల్లపు రవి, ప్రేమల శ్రీనివాస్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో నాగరాజు తెలిపారు.