కాచిగూడ : స్నేహితునిపై దాడి చేసిన వ్యక్తిపై కాచిగూడ పోలీసులు కేసు నమోదుచేశారు. ఎస్సై సురేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్లోని గోల్నాక భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ కుమారుడు ముక్కపల్లి సాయి(17), రాహుల్ స్నేహితులు.
అయితే రాహుల్ సోమవారం రాత్రి పీకలదాక మద్యం సేవించి సాయిని దుర్భాషలాడుతూ తలపై కర్రతో దాడి చేశాడు. దీంతో సాయి తలకు తీవ్ర గాయలయ్యాయి. సాయి ఫిర్యాదు మేరకు రాహుల్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.