బంజారాహిల్స్ : నిషేధిత గుట్కాలను సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం 12 మీదుగా ఓ వ్యక్తి నిషేదిత గుట్కాలను బైక్పై తీసుకువెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం రాత్రి నిఘా పెట్టారు.
లంగర్హౌజ్లోని హషీమ్నగర్కు చెందిన మహ్మద్ మాజిద్ (26) అనే వ్యక్తి తన హోండా యాక్టివా బైక్ మీద భారీగా గుట్కాలను తీసుకువెళ్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిని విచారించగా చందానగర్లో సోమేశ్వర్రావు అనే డీలర్ వద్దనుంచి కొనుగోలు చేస్తున్నట్లు మాజిద్ వెల్లడించాడు.
దీంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 42బాక్సుల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.