సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఆఫీస్, ఇతర ప్రాంతాలకు మెట్రోలో ప్రయాణించే వారు ఇక నుంచి మడత పెట్టే సైకిళ్లను తమవెంట తీసుకువెళ్లవచ్చు. ఈ మేరకు మెట్రో రైలు సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే సైకిల్ బ్యాగు సైజ్ 60/45/25 సెం.మీలు.. బరువు 15 కిలోలకు మించకుండా ఉండాలని నిబంధన విధించింది.
ఈ సైకిల్కు ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. ప్రయాణికులు మెట్రో దిగిన తర్వాత తమ గమ్యస్థానాలు చేరేందుకు ఇతర ప్రయాణ సాధనాలపై ఆధార పడకుండా సైకిళ్లపై వెళ్లడాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. గతేడాది ఓ ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ వివరాలు చెప్పామని అన్నారు.