స్తంభాలకు కుప్పలుగా కేబుల్స్
తగిలిస్తున్న ప్రైవేట్ సంస్థలు
లూపమాదకరంగా మారుతున్న వైనం
కొండాపూర్, ఏప్రిల్ 19 : విద్యుత్ స్తంభాలకు ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థల కేబుల్స్ని తగిలిస్తుండటంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇండ్ల మధ్యలోని స్తంభాలకు సైతం కుప్పలు తెప్పలుగా కేబుల్స్ని తగిలిస్తుండడంతో స్తంభం ఎక్కి దిగేందుకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొద్దిపాటి విద్యుత్ మిరుగులు పడిన ప్లాస్టిక్ కేబుల్స్ తగలబడి అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలె అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రమాదాలు జరిగే అవకాశం..
విద్యుత్ స్తంభాలకు ఇంటర్నెట్, టీవీ కేబుల్స్ని కుప్పలుగా చుడుతుండటంతో కొద్దిపాటి ఎలక్ట్రిక్ మిరుగులు పడినా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయి. జనావాసాల్లోని స్తంభాల పరిసరాల్లో అగ్నికారక పదార్థాలను దూరంగా ఉంచడంతో పాటు సాధ్యమైనంత వరకు కేబుల్స్ లేకుండా చూసుకోవాలి.
– జగన్మోహన్, మాదాపూర్ ఎస్ఎఫ్ఓ
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
విద్యుత్ స్తంభాలకు చుడుతున్న కేబుల్స్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాం. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు విద్యుత్ లైన్లను పరిశీలిస్తున్నాం.
– రాజేందర్, హఫీజ్పేట్ ఎలక్ట్రికల్ ఏఈ