మేడ్చల్, మార్చి18(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 వతేదీ వరకు ఆత్మీయ సమ్మేళనాలను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనుంది. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇంచార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో సమ్మేళనాల నిర్వహణపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేస్తామన్నారు. కాగా, మొట్టమెదటి సమావేశం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని కార్ఫొరేషన్, మున్సిపాలిటీలు, డివిజన్లు, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కేపీ, వివేకానంద, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జి మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.