హైదరాబాద్ : మీరు ఆకలితో ఉన్నారా? ఒకేసారి 100 రకాలకు పైగా వంటలను రుచి చూడాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం.. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కు వెళ్లి.. నోరూరించే వంటకాలను ఆరగించేద్దాం పదండీ.
బ్రింగ్ యువర్ ఓన్ బెల్లి(BYOB) అనే కార్యక్రమం పేరిట భోజన ప్రియుల కోసం మే 7వ తేదీన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అతిపెద్ద ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మొత్తం 150 ఫుడ్ స్టాల్స్ను ఏర్పాటు చేశారు.
వీటితో పాటు ఫ్యాషన్, లైఫ్ స్టైల్, స్టేషనరీతో పాటు పలు రకాలకు చెందిన 50 పాప్ అప్ స్టాల్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మే 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగనుంది. ఫుడ్ ఫెస్టివల్కు హాజరు కావాలనుకునే వారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్తో హాజరు కావాలి.