సిటీ బ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): నగరంలో ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో భాగంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు వివిధ శాఖల అధికారులు,మంత్రుల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన శుక్రవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ప్రభాకర్, సురభివాణీదేవి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, ప్రకాశ్గౌడ్ సాయన్న, సుభాష్రెడ్డి, రాజాసింగ్, డీజీపీ మహేందర్రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్త, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, ఈఎన్సీ గణపతిరెడ్డి, ట్రాన్స్కో సీఎండీ రఘుమారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, టూరిజం ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, సజ్జనార్, జూపార్క్ క్యురేటర్ బాబు పాల్గొన్నారు.
ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించిందని, అదేవిధంగా ఆలయాల్లో పూజలు, అలంకరణ కోసం ప్రత్యేకంగా రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిరహించేందుకు అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 3లక్షల మందికి సరిపడా మాస్క్లు, శానిటైజర్లు వ్యక్తిగతంగా తాను అందజేయనున్నట్లు తలసాని ప్రకటించారు. గోల్కొండ బోనాల ఉత్సవాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆర్టీసీ ఎండీ సునీల్శర్మను మంత్రి కోరారు. బోనాల సందర్భంగా 189 ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలను సమర్పించనున్నట్లు తెలిపారు.