బేగంపేట, ఆగస్టు 3: రాష్ట్రంలో శాంతిభద్రతలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని, ఫలితంగా పోలీసుశాఖ బలోపేతం అయ్యిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో అధునాతన హంగులతో నిర్మించిన మహంకాళి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ను మంగళవారం పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చురుగ్గా పనిచేస్తున్నదని కితాబిచ్చారు.
నగరంలో ట్రాఫిక్ ఆటోమేటిక్ సిస్టం మంచి ఫలితాలిస్తున్నదన్న మంత్రి.. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు సవ్యంగా ఉండడం వల్లే పెట్టుబడిదారులు పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, ఎమ్మెల్సీ వాణీదేవి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా, అదనపు కమిషనర్లు శిఖాగోయల్, చౌహాన్, అనిల్కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి అశోక్నగర్లోని నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలోని రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. సీఎం
కేసీఆర్ హయాంలోనే మన పండుగలు, సంస్కృతి,సంప్రదాయాలకు గుర్తింపు లభించిందని రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్నరాంమూర్తి, పౌర గ్రంథాలయాల డైరెక్టర్ శ్రీనివాసచారి, దేవీప్రసాద్, కార్పొరేటర్ పావని వినయ్కుమార్, టీఎన్జీవో నగర అధ్యక్షుడు ముజీబ్, కార్యదర్శి విక్రం, నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పద్మజా తదితరులు పాల్గొన్నారు.