సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ):అమీర్పేట్కు చెందిన వంశీమోహన్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్..వర్క్ ఫ్రం హోంకు సంబంధించి గూగుల్లో కొన్ని అంశాలను సర్చ్ చేస్తున్నాడు. బిట్కాయిన్కు సంబంధించిన ఒక లింక్ కన్పించగా దాన్ని క్లిక్ చేశాడు. అదే ఒక వాట్సాప్ నంబర్కు వెళ్లింది. దాంతో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయంటూ వాట్సాప్లో మెసేజ్లు రావడంతో పాటు వాటితో ఒక లింక్ కూడా వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేయగానే బిట్జాప్ యాప్ డౌన్లోడ్ అయ్యింది. వెంటనే తాము బిట్కాయిన్ ట్రేడింగ్ చేస్తున్నామంటూ ఫోన్ చేసిన వ్యక్తులు.. మీరు పెట్టుబడి పెట్టండి .. మేం ఇచ్చే సూచనలు పాటిస్తే చాలు.. మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తారని నమ్మించారు.
దీనికి ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ను పంపించారు. బాధితుడు ఆ యాప్ను డౌన్లోడ్ చేసి తన పేరుపై రూ. 10 లక్షలు.. తన భార్య పేరుతో మరో రూ. 10 లక్షలు అందులో పెట్టుబడి పెట్టాడు. కొన్నిరోజులకు స్క్రీన్పై రూ. 1.5 కోట్ల లాభం వచ్చినట్లు కన్పించింది. అయితే వాటిని డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా ఉంది. వెంటనే ఫోన్ చేసి తన డబ్బులు రావడం లేదంటూ మాట్లాడాడు. రెండు దఫాలుగా రూ. 40 లక్షలు డిపాజిట్ చేయించారు. ఆ తర్వాత రూ. 5 కోట్లు యాప్లో స్క్రీన్పై లాభం అంటూ చూపిస్తున్నది. దానిని డ్రా చేసుకోలేని పరిస్థితి. దీంతో బాధితుడు శుక్రవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసిఫ్నగర్కు చెందిన ముస్తాఫాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన గుర్తుతెలియని వ్యక్తులు ట్రేడింగ్ అండర్ స్కోర్ హాబ్1 పేరుతో యాప్ను డౌన్లో చేయించి.. అందులో రూ. లక్ష పెట్టుబడిగా పెట్టించి మోసం చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.