హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో (Jagadgirigutta) ఓ యువకుడు నాలాలో పడి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. గాజుల రామారాంలోని దేవేందర్నగర్కు చెందిన ఆసీఫ్ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అయితే గత నాలుగు రోజులుగా ఇంటికి రాకపోవడంతో ఆయన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈక్రమంలో శుక్రవారం ఉదయం జగద్గిరిగుట్టలోని బాలయ్యనగర్ వద్ద ఉన్న క్వారీ గుంతలో ఆసిఫ్ మృతదేహం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసున్నారు. అది ఆసిఫ్ డెడ్బాడీగా గుర్తించారు. దీంతో ఆసిఫ్ది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.