రంగారెడ్డి : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లిలో కొంతమంది యువకులు నిన్న రాత్రి వీరంగం సృష్టించారు. పీకల దాకా మద్యం సేవించిన బీహార్ యువకులు నడిరోడ్డుపై హంగామా చేశారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులపై దాడికి దిగారు. స్థానికంగా ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో మద్యం సేవించిన యువకులను పట్టుకుని శంషాబాద్ పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.