హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): రక్షణ రంగ సంస్థల నుంచి మంచి ఆర్డర్లు వస్తున్నాయని, నిర్దేశించిన సమయానికి రక్షణ ఉత్పత్తులను అందించేలా సిబ్బంది మరింత శ్రమించాలని బీడీఎల్ సీఎండీ కమాండర్ సిద్ధార్థ మిశ్రా పిలుపునిచ్చారు. బీడీఎల్ 52వ వ్యవ స్థాపక దినోత్సవం సందర్భంగా బీడీఎల్ కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లోనూ బీడీఎల్కు ఆర్డర్లు పెరిగాయని, ఫ్రెండ్లీ నేషన్స్ నుంచి కూడా ఎగుమతులకు ఆర్డర్లు వస్తున్నట్టు తెలిపారు. బీడీఎల్ ఇప్పటికే హెవీ వెయిట్ ట్రోపిడో వరుణాస్త్ర, ఆకాష్ మిస్సైల్స్ను విజయవంతంగా తయారు చేసి అందించిందన్నారు. సీఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా సమాజ శ్రేయస్సుకోసం కూడా పనిచేస్తున్నామని, కొవిడ్-19 సమ యంలో తెలంగాణ ప్రభుత్వానికి డీప్ ఫ్రీజర్లను అందించిందని ఆయన గుర్తుచేశారు.