సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/చార్మినార్) : చార్మినార్ సమీపంలో ఉన్న చారిత్రక బాద్షాహీ అషుర్ ఖానాకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కులీకుతుబ్షా ఆధ్వర్యంలో 1594లో నిర్మాణం కాగా..ఇమామ్ హుస్సేన్ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించారు. మొహర్రం సందర్భంగా ఈ పవ్రిత స్థలాన్ని వినియోగిస్తున్నారు.
గురువారం పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ బాద్షాహీ అషూర్ఖానాను సందర్శించారు. కుడా, ఆగాఖాన్ ట్రస్ట్ సహకారంతో బాద్షాహీ అషూర్ఖానాను పునరిద్ధరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఖుర్షీద్ జాహ్ దేవిడిని అర్వింద్ కుమార్ సందర్శించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, హెచ్ఎండీఏ అధికారులు ఖలీద్ బిన్ మజీ పాల్గొన్నారు.