కరోనాతో కొందరు దవాఖానల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతుండగా.. వారికి అవసరమైన మందులను బ్లాక్లో విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వారిపై నిఘాపెట్టిన హైదరాబాద్ టాస్క్పోర్స్ నెల రోజుల్లో 42 కేసులు నమోదుచేసి 93మందిని అరెస్టు చేశారు. అయితే డాక్టర్లు, మెడికల్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు, రిప్రెజెంటేటివ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ముఠాగా ఏర్పడి రెమ్డెసివిర్, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే అంపోటెరిసన్ బి ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు బ్లాక్లో విక్రయిస్తున్నట్లు తేలింది. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలతో హైదరాబాద్లోని ఐదు జోన్ల టాస్క్ఫోర్స్ పోలీసులు 24/7 బ్లాక్ దందాపై నిఘా వేసి అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొవిడ్తో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లు విక్రయించే వారిపై పోలీస్ శాఖ చర్యలు చేపడుతున్నది. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలతో టాస్క్ఫోర్స్ బృందాలు బ్లాక్మార్కెట్కు మందులు తరలివెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నాయి. బ్లాక్మార్కెట్కు సంబంధించి అరెస్టవుతున్న గ్యాంగ్లలో 96 శాతం మెడికల్ ఫీల్డ్తో సంబంధం ఉన్నవారే ఉంటున్నారు. సామాన్య ప్రజలు బ్లాక్ దందాపై స్థానిక పోలీసులకు, టాస్క్ఫోర్స్కు సమాచారం ఇవ్వాలి. – రాధాకిషన్ రావు, టాస్క్ఫోర్స్ డీసీపీ