బంజారాహిల్స్,అక్టోబర్ 6: ప్రేమిస్తున్నానని బాలికను లోబర్చుకోవడంతో పాటు లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని వినాయక్నగర్ బస్తీకి చెందిన మహేష్ అలియాస్ కృష్ణ చైతన్య(20) జూబ్లీహిల్స్ క్లబ్లో డాటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న పదో తరగతి విద్యార్థిని(16)ని గత కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో నమ్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెను తనతో పాటు బైక్ మీద తీసుకెళ్లిన మహేష్ మాట్లాడుకుందామని నమ్మించి ఖాళీగా ఉన్న తన పిన్నీ గదిలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీకే నష్టం అంటూ బెదిరించాడు. కాగా రెండు రోజుల క్రితం తన కూతురు ముభావంగా ఉండడంతో జరిగిన దారుణాన్ని చెప్పింది. ఈ మేరకు బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడు మహేష్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేశారు.