మన్సూరాబాద్, ఆగస్టు 19: నక్సల్స్ ముసుగులో వ్యాపారులను బెదిరించి డబ్బుల వసూళ్లకు యత్నించిన కేసులోనలుగురిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం డీసీపీ సన్ప్రీత్సింగ్ వివరాలు వెల్లడించారు. కృష్ణ జిల్లా, పామర్రు గ్రామానికి చెందిన కొడుమూరి శ్రీనివాస్ అలియాస్ జనార్దన్రెడ్డి అలియాస్ భాస్కర్ (45) డైలీ ఫైనాన్స్ చేస్తుంటాడు. గతంలో సీపీఐ ఎంఎల్లో పనిచేశాడు. సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు మండలం, ఏపూరు గ్రామానికి చెందిన ఆలుట్ల ఉప్పలయ్య అలియాస్ ఉపేందర్ (42) కొత్తపేట, చైతన్యపురి, ప్రభాత్నగర్లో నివాసముంటూ పెయింటింగ్ పనిచేస్తుంటాడు. యాదాద్రి భువనగిరి జిల్లా, మోటకొండూరు మండలం, దిలావర్పూర్ గ్రామానికి చెందిన తాటికాయల సురేందర్ అలియాస్ సూర్యం (40) కూలీ పని చేస్తుంటాడు. భాస్కర్, ఉపేందర్, సూర్యం ముగ్గురు కలిసి ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. వీరికి సహాయకులుగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం, ఏపూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్గా పని చేసే ఆలుట్ల గణేశ్ (21)తో పాటు వెంకన్న అనే ఇద్దరిని నియమించుకున్నారు. నక్సల్స్ ముసుగులో ముగ్గురు కలిసి వ్యాపారులకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. మోహన్నగర్లో భాస్కర్, ఉపేందర్, సూర్యం, గణేశ్లను చైతన్యపురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. వెంకన్న పరారీలో ఉన్నాడు. కారు, ల్యాప్టాప్, సెల్ఫోన్లు విజిటింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.