హైదరాబాద్ : డ్రగ్స్కు అలవాటు పడి డ్రగ్స్ విక్రయాన్ని వ్యాపారంగా మార్చుకున్న ఒక ముఠాను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ(Task Force DCP) నితికా పంత్ కథనం ప్రకారం.. గోల్కొండ, 7 టూంబ్స్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముజఫర్ అలీ, స్నేహితుడు టోలిచౌక్కు చెందిన అబుబాకర్ బిన్ అబ్దుల్ అజీజ్ లు డ్రగ్స్కు అలవాటు పడ్డారు. సులభంగాడబ్బు సంపాదించాలన్న ఆశతో టోలిచౌక్కు చెందిన మరో స్నేహితుడు మహ్మద్ ఖాసీంకు రూ. 80 వేలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లోని పాడేర్కు పంపి అక్కడి నుంచి లీటర్ హాష్ ఆయిల్(Hash Oil) కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకువచ్చారు.
ఈ ఆయిల్ను సోమాజిగూడలోని సయ్యద్ ముర్తుజా అలీ ఇంటిని అడ్డాగా చేసుకొని 5 మిల్లీ లీటర్ల బాటిళ్లలో నింపుతున్నారు. ఒక్కో బాటిల్ను రూ. 2 వేల చొప్పున సబ్ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నారు. టోలిచౌక్, మాదాపూర్ ప్రాంతాలకు చెందిన సయ్యద్ ముర్తుజా అలీ హుస్సేన్, నితిన్గౌడ్, పూనమ్ కుమారి కౌర్లు సబ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ హాష్ ఆయిల్ ఒక్కో బాటిల్ను రూ. 3 వేలు, ఛారస్లను అవసరమైన వారికి విక్రయిస్తూ డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు.
గ్యాంగ్లోని ఆరుగురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు జీషాన్ నవీద్, సయ్యద్ అన్వరుల్లా హుస్సేని ఖాద్రి పరారీలో ఉన్నారని డీసీపీ వెల్లడించారు. ఈ ముఠా నుంచి 310 మిల్లీ లీటర్ల హాష్ అయిల్, 70 గ్రాముల ఛారస్, ఒక ద్విచక్రవాహనం, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ కేసు తదుపరి విచారణ బాధ్యతలను ఫిలిమ్నగర్ పోలీసులకు అప్పగించామని వెల్లడించారు.