హైదరాబాద్, జనవరి 5 / బేగంపేట: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల (అమెరికా లో ఉంటున్న) కుటుంబసభ్యులకు వైద్యసేవలు అందించేందుకు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ), ఆర్మ హెల్త్కేర్ సంస్థలు ఆప్యాయ హెల్త్కార్డును రూపొందించాయి. బుధవారం సికింద్రాబాద్ సన్షైన్ దవాఖానలో జరిగిన కార్యక్రమం లో రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకొన్నాయి. ఈ సందర్భంగా ఆప్యాయ హెల్త్కార్డు ప్రమోటర్, సన్షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారైల తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వేల మైళ్ల దూరంలో ఉన్నవారు ఆందోళన పడుతున్నారని, ఇకమీదట అలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా ఈ ఆప్యాయ హెల్త్కార్డును రూపొందించినట్టు తెలిపారు. ఈ కార్డు ద్వారా టీటీఏ కుటుంబాలకు అత్యవసర సమయాల్లో ఆర్మ హెల్త్కేర్ నెట్వర్లో ఉన్న సన్షైన్, కిమ్స్ వంటి మల్టీస్పెషాలిటీ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. టీటీఏ అధ్యక్షుడు పట్లోళ్ల మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఆప్యాయ హెల్త్కార్డుతో ఎన్నారైల కుటుంబాలకు భరోసా దొరుకుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం 6 వేల కుటుంబాలు ఇందులో సభ్యత్వం పొందాయని తెలిపారు. కార్యక్రమంలో సన్షైన్ దవాఖాన సీఈవో నాగరాజు, టీటీఏ ప్రతినిధులు నరసింహారెడ్డి, సతీశ్రెడ్డి, వెంకట్ గడ్డం, హరిందర్ తదితరులు పాల్గొన్నారు.