ఘట్కేసర్రూరల్, అక్టోబర్ 29: అవినీతి అంతమే లక్ష్యంగా ప్రతి విద్యార్థి పని చేయాలని పవర్గ్రిడ్ సీనియర్ జనరల్ మేనేజర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఘట్కేసర్ మండల పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్గ్రిడ్ సీనియర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ అవినీతి అంతమొందించినప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమన్నారు. అనంతరం విద్యార్థులకు అవినీతి అంతంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ యన్. రాంచంద్రన్, రిజిస్ట్రార్ సమిన్ ఫాతిమా, డీన్ జి.విష్ణుమూర్తి, ఈఈఈ విభాగాధిపతి అనిల్ కుమార్, కో ఆర్డినేటర్ వేణుమాధవ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.