ఎల్బీనగర్ : ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం కోసం ఎల్బీనగర్ జంక్షన్లో మరో అండర్పాస్ అందుబాటులోకి వచ్చిందని, త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
శుక్రవారం ఎల్బీనగర్ జంక్షన్లో ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా ఇన్నర్ రింగ్రోడ్డు నుండి సాఫీగా ప్రయాణం కోసం నిర్మాణం పూర్తి చేసుకున్న మరో అండర్పాస్ ను ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ది విషయంలో రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ రూపురేఖలు మారిపోతాయన్నారు.
ఇన్నర్ రింగ్రోడ్డులో ఎల్బీనగర్ జంక్షన్లో ఇరువైపులా సాఫీగా ప్రయాణం కోసం రెండు అండర్పాస్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే ఎడమవైపు అండర్పాస్ ద్వారా ఇరువైపులా ప్రయాణాలు సాగుతున్నాయని, కుడివైపు అండర్పాస్ కూడా అందుబాటులోకి వస్తే ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు అనువుగా ఉంటుందన్నారు.
ఎల్బీనగర్ జంక్షన్తో పాటుగా బైరామల్గూడ జంక్షన్ వద్ద ఫ్లె, స్కై ఓవర్ పనులు కూడా యుద్ద ప్రాతిపదికన సాగుతున్నాయని అన్నారు.