సిటీ బ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను దక్కించుకున్న అభ్యర్థులకు హెచ్ఎండీఏ మరో అవకాశం కల్పించింది. టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు గడువు పెంచింది. రెండో దశలో జరిగిన లక్కీ డ్రాలో ఫ్లాట్లను దక్కించుకున్నవారు ఈనెల 26న టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
అయితే పండుగలు, ఇతర సెలవుల కారణంగా లబ్ధిదారుల అభ్యర్థన మేరకు వచ్చే నెల 2 వరకు గడువును పొడిగించారు. సింగిల్ బెడ్రూం రూ.లక్ష, డబుల్ బెడ్రూంకి రూ.2లక్షలు, ట్రిపుల్ బెడ్రూంకి రూ.3లక్షలుగా నిర్ణయించారు.