గోల్నాక : ఓ వృద్ధురాలు అదృశ్యమైన ఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాల్వేరు మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్అంబర్పేట పోచమ్మబస్తీలో నివాసముంటున్న చింతా కళావతి (68)..ఈనెల 5న ఉదయం డీడీ కాలనీలో పింఛన్ కోసమని వెళ్లి ఇప్పటికీ తిరిగిరాలేదు.
తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం బాధితురాలి మనవరాలు రమ్యకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.