అంబర్పేట, ఏప్రిల్ 29 : రోడ్డు కటింగ్ పనులకు అనుమతి లేకపోవడంతో జలమండలికి సంబంధించిన అభివృద్ధి పనులు ఆగిపోయాయని, వెంటనే పనులకు అనుమతి మంజూరు చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో గురువారం జలమండలి, ఆర్ అండ్బీ అధికారులతో రోడ్డు కటింగ్ విషయమై చర్చించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాచిగూడ డివిజన్లోని నింబోలిఅడ్డ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ నుంచి 200 మీటర్ల వరకు పైపులైన్ ఏర్పాటు చేయనున్న దృష్ట్యా రోడ్డు కటింగ్నకు అనుమతి ఇవ్వాలని చెప్పారు. అలాగే సదానంద్ హోటల్ నుంచి గోల్నాక మార్కెట్ వరకు 300 మీటర్ల మేర ఏర్పాటు చేయనున్న ఆర్సీసీ పైపులైన్ పనుల కోసం కూడా రోడ్డు కట్టింగ్నకు అనుమతి ఇవ్వాలన్నారు. ఈ అనుమతి లేకపోవడంతో కొన్ని నెలలుగా పనులు ఆగిపోయాయని చెప్పారు. వెంటనే అనుమతులు ఇస్తే పనులు మొదలుపెడతారని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు తాత్సారం చేయవద్దని తెలిపారు. త్వరలోనే పనులు ప్రాంరభించాలన్నారు. ఈ సమావేశంలో జలమండలి జీఎం మహేశ్కుమార్, డీజీఎం సన్యాస్రావు, మేనేజర్ మహేందర్, ఏఈ శేఖర్, ఈఈ ధర్మారెడ్డి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.