వ్యవసాయ యూనివర్సిటీ , సెప్టెంబర్ 14: దేశం వ్యవసాయ, అనుబంధ రంగాలలో అభివృద్ధి చెందాలంటే ప్రకృతి, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో పాటు అధికారుల పాత్ర కీలకమైందని దక్షిణ భారత ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, ఇనిస్టిట్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వివిధ రాష్ర్టాల అధికారులతో ఆన్లైన్లో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ విస్తరణ విద్యా సంస్థ, వ్యవసాయ, అనుబంధ రంగాలలోని విస్తరణ కార్యక్రమాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అండమాన్, ఆంధ్రప్రదేశ్కు ఎంపికైన అధికారులకు ఆయా శాఖలపై అవగాహన అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారని తెలిపారు.