అర్ధరాత్రి అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
టోలిచౌకి బ్రిడ్జిపై ఘటన
మెహిదీపట్నం, మే 10 : అతి వేగంగా దూసుకువచ్చిన ఓ బైక్.. డివైడర్ను ఢీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్ర గాయాలపాలైన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్హాట్కు చెందిన మహ్మద్ నవాజ్(17), మల్లేపల్లి అఫ్జల్సాగర్ ప్రాంతానికి చెందిన రియాన్(18) స్నేహితులు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ద్విచక్రవాహనంపై టోలిచౌకి వంతెన మీదుగా షేక్పేట్వైపు అతి వేగంగా వెళ్తున్నారు. బ్రిడ్జిపైకి ఎక్కగానే వీరి వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన మహ్మద్ నవాజ్ అక్కడికక్కడే మృతి చెందగా.. రియాన్కు తీవ్ర గాయాలయ్యాయి. రియాన్ను స్థానికులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నవాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.