సికింద్రాబాద్, జనవరి 3;గతంలో నిర్లక్ష్యానికి గురైన బస్తీలు నేడు మెరుగులు దిద్దుకుని అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. గుంతలమయంగా ఉన్న దారులకు మోక్షం కలిగి అద్దంలా మెరుస్తున్నాయి. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోనే వెనుకబడిన ప్రాంతంగా గుర్తించబడిన రసూల్పురాను అభివృ ద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే రెండో వార్డులో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టీఎన్ శ్రీనివాస్ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. కోట్ల రూపాయల నిధులతో బస్తీని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషించారు. కంటోన్మెంట్ బోర్డు నిధులను రాబట్టడంతో పాటు ఎమ్మెల్యే కోటా కింద నిధులను తీసుకొచ్చి బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. ప్రధానంగా రసూల్పురాలోని వల్లభభాయ్ పటేల్ నగర్, ఇందిరమ్మనగర్, శ్రీలంకబస్తీ, అర్జున్నగర్, అన్నానగర్ల్లో సీసీ రోడ్లు ,భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం, మంచినీటి పైపులైన్ల పనులు పూర్తి చేయించారు.
మెరుగైన సౌకర్యాలకు కృషి
వార్డును మరింత అభివృద్ధి చేసే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. బోర్డుతో పాటు ఎమ్మెల్యే సాయన్న కోటా నుంచి నిధులు రప్పించి పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ బస్తీవాసులకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే ప్రతి కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ప్రజా అవసరాలకు అనుగుణంగా మినీ ఫంక్షన్హాల్ పనులు పూర్తిచేశాం. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు సాధించి అభివృద్ధికి ఆదర్శంగా వార్డును తీర్చిదిద్దుతాం
– టీఎన్ శ్రీనివాస్,మాజీ చైర్మన్, బోయిన్పల్లి మార్కెట్