సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ ఈవీడీఎం కార్యాలయాన్ని ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ బృందం గురువారం సందర్శించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన తొమ్మిది మంది ఉన్నతాధికారుల బృందాన్ని కమిషనర్ రోనాల్డ్ ఈవీడీఎం డైరెక్టర్ ఎన్ ప్రకాష్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుద్ధభవన్ ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈవీడీఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్న రెస్పాన్స్ ఫోర్స్ ఈ బృందం సదర్శించింది. పట్టణ వరదలు, చెట్లు కూలడం, భవనం కూలడం తదితర డీఆర్ బృందాల పనితీరుపై డెమోను వారికి అందజేశారు.
డీఆర్ వాహనాలు, డ్రోన్ కెమెరా మొదలైన వాటిని చూపించారు. ఆనంతరం సంజీవయ్య పార్కు ట్రాన్స్ స్టేషన్ సందర్శించింది. ఆ తర్వాత జవహర్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్ ప్లాంట్, పట్టణ వరదలను నియంత్రణలో సత్పలితాలను ఇస్తున్న ఎస్ పథకం పనులను శుక్రవారం క్షేత్రస్థాయిలో ఈ బృందం పర్యటన చేయనుంది. ఈ కార్యక్రమంలో ఇఎన్ జియావుద్దీన్, ఎస్ అధికారి కిషన్ , డీఆర్ కంట్రోల్ రూం సిబ్బంది పాల్గొన్నారు.