హైదరాబాద్ : ఓ ముగ్గురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో ఒకరు ప్రేమలో పడ్డాడు. అయితే అతని ప్రియురాలిని మరో అబ్బాయి టీజ్ చేస్తున్నాడు. తన పిల్లను టీజ్ చేయడాన్ని సహించని ఆ ప్రేమికుడు.. స్నేహితుడిపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఆ యువకుడిపై కత్తితో దాడి చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఫిలిం నగర్లోని ఓ స్కూల్లో దుర్గా ప్రసాద్తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు టెన్త్ క్లాస్ చదువుతున్నారు. పార్టీ చేసుకుందామని చెప్పి మిగతా ఇద్దరు కలిసి దుర్గా ప్రసాద్ను బయటకు తీసుకొచ్చారు. ఓ హోటల్లో భోజనం చేసిన తర్వాత గండిపేట వెళ్దామని చెప్పి.. దుర్గా ప్రసాద్ను బైక్పై ఎక్కించుకుని అత్తాపూర్ మూసీ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడ దుర్గా ప్రసాద్పై మిగతా ఇద్దరు కత్తితో దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కత్తి దాడికి పాల్పడ్డ ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరిలో ఒకరి లవర్ను దుర్గాప్రసాద్ టీజ్ చేయడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు స్పష్టం చేశారు.