మేడ్చల్ రూరల్, జనవరి 30 : స్వచ్ఛ సమాజం అందరి బాధ్యత అని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పామిడోస్లో స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఆదివారంలో ఘన వ్యర్థాల నిర్వహణ, హోం కంపోస్టింగ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం పరిశుభ్రత పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మున్సిపాలిటీ కృషి ఫలిస్తుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకృతి వనం ప్రసాద్ హాజరై ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంట్లో కంపోస్టు ఎరువును తయారు చేసుకొని, వినియోగించుకోవడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ లావణ్య, కౌన్సిలర్లు వీణాసురేందర్ గౌడ్, మల్లికార్జున్ ముదిరాజ్, అమరం సరస్వతీ, హంసరాణి, అమరం హేమంత్ రెడ్డి, అమరం జైపాల్ రెడ్డి, బేరి బాలరాజు, నాయకులు ఫిలిప్స్, సుధాకర్, వెంకటేశ్ ముదిరాజ్, వివిధ కాలనీల ప్రతినిధులు రవికాంత్ రెడ్డి, పవన్రెడ్డి, శ్రీనివాస్, జబర్దస్త్ ఫేం రఘు, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.