Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్లోని మధురానగర్లో భారీ చోరీ జరిగింది. వాస్తు నిపుణులు వీఎల్ఎన్ ఇంట్లో రూ. నాలుగు కోట్లను ఎత్తుకెళ్లారు. ఊరికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో ఉన్న రూ. నాలుగు కోట్లతో పాటు బంగారం చోరీకి గురైనట్లు వీఎల్ఎన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇల్లు కొనుగోలు కోసం జమ చేసుకున్న డబ్బులను మొత్తం చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.