జూబ్లీహిల్స్,జూన్ 25 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలతో ప్రతిపక్ష పార్టీలు బెంబేలెత్తుతున్నాయని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు.
శనివారం రహ్మత్నగర్ డివిజన్ హబీబ్ ఫాతిమానగర్ ఫేస్-1లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు సుమారు 300 మంది టీఆర్ఎస్లో చేరగా, వారికి ఎమ్మెల్యే మాగంటి గులాబీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, నాయకులు తన్నూఖాన్, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, బస్తీ అధ్యక్షులు షరీఫ్, బషీర్, అర్షద్, నాగరాజు, జబ్బార్, జగన్ తదితరులు పాల్గొన్నారు.