శ్రీనగర్: భారత్-పాక్ సరిహద్దుల్లో మాదక ద్రవ్యాలను తరలిస్తున్న వ్యక్తిని భద్రతా దళాలు కాల్చివేశాయి. అతడి నుంచి 27 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్లోని కథువాలో ఉన్న హీరానగర్ సెక్టార్లో బుధవారం తెల్లవారుజామున అక్రమంగా హెరాయిన్ను తరలిస్తున్న వ్యక్తిని సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. అతడిని లొంగిపోవాలని కోరినప్పట్టికీ వినకపోవడంతో కాల్చివేశారు. అనంతరం అతని వద్ద 27 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ.135 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.