కలెక్టర్ వీపీ గౌతమ్
దంతాలపల్లి, మార్చి 30 : విద్యతోనే ఆత్మవిశ్వాసం పెంపొం దుతుందని, సమాజంలో ముందుకెళ్లాలంటే విద్య ఎంతో ము ఖ్యమని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో స్వేరోస్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమవేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నతమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడంపై స్వేరోస్ కమిటీని అభినందించారు. అనంతరం కుమ్మరికుంట్ల, గున్నెపల్లి గ్రామాల్లో సబ్సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఎన్ వెంకటేశ్వర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాము, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ వీ మల్లారెడ్డి, సర్పంచ్ ఏ కృష్ణ, ఎంపీటీసీ వెంకన్న, తహసీల్దార్ అబిద్ అలీ, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖ అధికారులు, స్వేరో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ గుండె రాంనర్సయ్య, స్వేరో స్ నాయకులు ఉమేశ్, రమేశ్, జగన్, రంజిత్, పవన్ ఉన్నారు.
ధరణి పోర్టల్ కార్యాలయం ప్రారంభం..
మరిపెడ: తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ వీపీ గౌతమ్ ధరణి పోర్టల్ ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించారు. క్యాబిన్ల ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధరణి పోర్టల్తో రిజిస్ట్రేషన్స్, మ్యుటేషన్ వెంటనే అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేశ్బాబు, రెవె న్యూ ఇన్స్పెక్టర్ నజీమొద్దీన్ ఉన్నారు.