నగరం నుంచి 150 ప్రత్యేక బస్సులు
ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు బస్సుల రాకపోకలు
ఈ నెల 16 నుంచి రోజూ మూడు సూపర్ లగ్జరీలు
టిక్కెట్ ధర రూ.398 నిర్ణయం
మేడారం, తాడ్వాయిలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్టీసీ అధికారులు
సిటీబ్యూరో, జనవరి 11(నమస్తే తెలంగాణ)/సుల్తాన్ బజార్: రాష్ట్రంలో అతి పెద్ద పండుగైన ‘సమ్మక్క సారక్క’ జాతర అప్పుడే రానే వచ్చింది. వచ్చే నెల రెండో వారంలోనే నిర్వహించనున్నారు. అయితే, ఇందుకు సంబంధించి నగరం నుంచి మేడారం జాతరకు భక్తులను తరలించేందుకు టీఎస్ఆర్టీసీ పకడ్బందీగా సిద్ధమవుతుంది. అందుకు నగరం నుంచి దాదాపు 150 వరకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం ఆర్టీసీ అధికారులు మేడారం, తాడ్వాయిలో బస్సుల పాయింట్లు, నిర్వహణ, సదుపాయాల కల్పన వంటి అన్ని అంశాలపై పరిశీలించారు. అందుకు సంబంధించి షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే, ఈ మేరకు ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు నగరం నుంచి 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎంజీబీఎస్) యుగంధర్ తెలిపారు. అయితే, 150 బస్సులలో జేబీఎస్ నుంచి 20 వరకు జగద్గిరిగుట్ట నుంచి 30 బస్సులు కాగా.. మిగిలిన బస్సులను ఎంజీబీఎస్ నుంచి నడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
16 నుంచి రోజూ మూడు సూపర్ లగ్జరీలు..
మేడారం జాతర ఫిబ్రవరిలో నిర్వహించనున్న నేపథ్యంలో కొంత మంది భక్తులు ముందుగానే జాతర స్థలానికి చేరుకుని సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి అప్పుడే సిద్ధంగా ఉన్నా రు. వారిని దృష్టిలో పెట్టుకుని ఎంజీబీఎ స్ నుంచి ప్రతి రోజూ మూడు సూపర్ లగ్జరీలను నడిపించడానికి ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ఉదయం 6 గంటలకు, 7గంటలకు, 8గంటలకు ఈ విధం గా ప్రతి గంటకు ఒకటి చొప్పున ఎంజీబీఎస్ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సు లు నడిపిస్తామన్నారు. ఆ బస్సులు తిరిగి మేడారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు, 4గంటలకు, 5గంటలకు వరుసగా బయలు దేరుతాయన్నారు. ఈ బస్సుల లో ప్రయాణ ఛార్జీలు ప్రతి ఒక్కరికి రూ. 398లు, 11 యేండ్లలోపు చిన్నారులకు రూ.200లుగా ఆర్టీసీ నిర్ణయించినట్లు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ తెలిపారు.