కీసర, నవంబర్ 24: మండలంలో 108 సేవలు ప్రజలకు విజయవంతంగా అందుతు న్నాయి. ముఖ్యంగా గర్భిణులకు పురిటి నొప్పు లు వచ్చినప్పుడు నార్మల్ ప్రసవం చేస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. రోడ్డు ప్రమాదా ల్లో గాయాలైన వారిని కూడా సకాలంలో దవాఖానకు తరలిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నారు. కాల్ చేసిన నిమిషాల వ్యవధిలో ని ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను రక్షిస్తున్నారు. 108 సేవలు మండలంలో 2010 సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చా యి. ఇప్పటి వరకు మొత్తం 160 మంది గర్భిణలుకు అంబులెన్స్లోనే డెలివరీ చేశారు. ఇంకా ఇండ్లల్లో నార్మల్ డెలివరీలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఆరు సార్లు ఉత్తమ అవార్డులు
రోడ్డు ప్రమాదాలు జరిగి అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రుల వద్ద లభించిన నగదు మొత్తం రూ.6. 60 లక్షలు, 12 తులాల బం గారు ఆభరణాలు సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరు చేసిన సేవలకుగాను మండల 108 సిబ్బంది ఈఎంటీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్కు జిల్లా కలెక్టర్లు, మంత్రుల నుంచి ఆరు సార్లు ఉత్తమ అవార్డు అందుకున్నారు.
వెంటనే స్పందిస్తాం..
108 అంబులెన్స్ కు కాల్ రాగానే క్షణా ల్లో సంఘటనా స్థలానికి చేరుకొంటాం. తాము మహిళలకు, రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని క్షణాల్లో దవాఖానలకు తరలించి ప్రాణాలను కాపాడుతున్నాం. తాము చేస్తున్న సేవలను గుర్తించి అప్పటి జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డితో పాటు మంత్రుల చేత కూడా ఉత్తమ టెక్నిషియన్గా అవార్డు అందుకున్నా.
-108 ఈఎంటీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రవి