రవీంద్రభారతి,అక్టోబర్ 19 : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో కూచిపూడి పితామహడు పద్మభూషణ్ డా. వెంపటి చిన్న సత్యం మాస్టారు జయంతిని పురస్కరించుకుని సిరిసిరి మువ్వలు కూచిపూడి నృత్యం ఎంతో అట్టహాసంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు (న్యూ ఢిల్లీ) డా. సముద్రాల వేణుగోపాలచారి విచ్చేసి మాట్లాడుతూ నృత్యం నేర్చుకోవడంతో శారీరక దృఢత్వంతో పాటు ఏకాగ్రత పెంపొంది ఇతర రంగాల్లో ముందజలో ఉంటారని తెలిపారు.
పద్మభూషణ్ డా.వెంపటి చిన్న సత్యం మాస్టారు కూచిపూడి రంగంలో అందించిన సేవలు,కూచిపూడి నృత్యాలు అద్భుతమని కొనియాడారు. ఇంతమంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్ కేవీ. రమణారావు, లలితారావును అభినందించారు.భారతీయ కళలను, సంస్కృతిని యువతరానికి అందించడమే కాకా విశ్వవ్యాప్తం చేయడంలో ముఖ్య భూమికను పోషిస్తున్నారని కొనియాడారు. అనంతరం పలువురు గురువులు చేస్తున్న సేవలను గుర్తించి వారికి అవార్డులతో సన్మానించారు.
సన్మాన గ్రహీతలు మేల్లచెరువు కామేశ్వరీ పెంపటి చిన్నసత్యం కుమార్తె, చింతా, శివా ఆదినారాయణ కూచిపూడి డాన్స్ అకాడమీ, కృష్ణప్రియ, రాధ, తాడూరి రేణుక, ప్రసాద్, విజయలక్ష్మి, హరికుమార్, మహేశ్బాబు,జ్యోతిరెడ్డి, నాట్యరవళి, దీపికా, రాంబాబు, ప్రశాంత్కుమార్, సరస్వతిరాజ్, స్వర్ణనాగలక్ష్మి, అశ్వినికుమారి, పావని ఉన్నారు. ఈ కార్యక్రమానికి సతీశ్కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా లయన్ కేవీ.రమణారావు, లలితారావు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.